మాస్ చిత్రాలకు కమర్షియల్ చిత్రాలకు పెట్టింది పేరు గోపీచంద్. ఇటీవలే సంపత్ నంది దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన సిటిమా ర్ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పక్క మాస్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం తో మంచి విజయం అందుకున్న గోపీచంద్ ఇప్పుడు ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు మారుతి.

ఇటీవల మంచిరోజులొచ్చాయి అనే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఈ మాస్ హీరోతో కలిసి చిత్రాన్ని చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలయింది. ఈ సినిమా టైటిల్ పై ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం అనే డైలాగ్ కు ప్రేక్షకుల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ డైలాగ్ ను బట్టి చూస్తే మారుతి గోపీచంద్ క్యారెక్టర్ ను సరికొత్తగా డిజైన్ చేశాడని స్పష్టంగా అర్థమవుతుంది.

గోపీచంద్ తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా చాలా స్టైలిష్ గా ఈ చిత్రంలో కనిపించడం విశేషం. మరి ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు ఉన్న ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ మరొకసారి అద్భుతమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ తో కలిసి రాశీ ఆక్సిజన్ , జిల్ వంటి హిట్ చిత్రాల్లో నటించగా ఇపుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. జేక్స్ బిజాయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. గోపీచంద్ 29 వ రాబోతున్న ఈ చిత్రం ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: