అయితే హీరోగా కాకుండా నిర్మాతగా ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కారణాలేవైనా కూడా నిర్మాతగా పవన్ కళ్యాణ్ అసలు పనికిరాడు అనే విషయం నిరూపణ అయ్యింది. దాంతో ఆయన హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన చల్ మోహన రంగా చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాడు. అలా రెండు సినిమాలకు భారీ నష్టాలను చవి చూసిన పవన్ కళ్యాణ్ వారి జోలికి పోవద్దని అప్పట్లో నిర్ణయించుకున్నాడు అని వార్తలు వచ్చాయి.
అయితే తాజా పరిస్థితుల ప్రకారం ఆయన మళ్లీ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడట. కారణాలైతే తెలియదు గానీ తొందరలోనే ఆయన ఓ యువ హీరో తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మెగా హీరోలు ఉండబోతున్నారు అని చెబుతున్నారు. ఆయన మేనల్లుల్లు అయిన సాయి ధరం తేజ్ వైష్ణవ్ తేజ్ లలో ఒకరిని హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నారట పవన్ కళ్యాణ్. మరి గతంలో నిర్మాత గా మారి చేతులు కాల్చుకున్న పవన్ కళ్యాణ్ ఈ సారి సూపర్ హిట్ సినిమా చేసి నిర్మాత గా కూడా సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.