తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ సంగతి అందరికి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఏ సినిమా ఫంక్షన్ కు వచ్చిన వేలల్లో అభిమానులు తరలి వచ్చి ఆయనను చూసి తరిస్తారు. అలా భారీ అభిమానం ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ దేశ చరిత్ర లో ఎప్పటికీ మిగిలిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పోతే పవన్ కళ్యాణ్ హీరోగా మళ్ళీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు పోతూ ఉండగా నిర్మాతగా కూడా గతంలో కొన్ని ప్రయత్నాలు చేశాడు.

అయితే హీరోగా కాకుండా నిర్మాతగా ఆయన చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. కారణాలేవైనా కూడా నిర్మాతగా పవన్ కళ్యాణ్ అసలు పనికిరాడు అనే విషయం నిరూపణ అయ్యింది. దాంతో ఆయన హీరోగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన చల్ మోహన రంగా చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకున్నాడు. అలా రెండు సినిమాలకు భారీ నష్టాలను చవి చూసిన పవన్ కళ్యాణ్ వారి జోలికి పోవద్దని అప్పట్లో నిర్ణయించుకున్నాడు అని వార్తలు వచ్చాయి.

అయితే తాజా పరిస్థితుల ప్రకారం ఆయన మళ్లీ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడట. కారణాలైతే తెలియదు గానీ తొందరలోనే ఆయన ఓ యువ హీరో తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మెగా హీరోలు ఉండబోతున్నారు అని చెబుతున్నారు. ఆయన మేనల్లుల్లు అయిన సాయి ధరం తేజ్ వైష్ణవ్ తేజ్ లలో ఒకరిని హీరోగా పెట్టి సినిమా చేయబోతున్నారట పవన్ కళ్యాణ్. మరి గతంలో నిర్మాత గా మారి చేతులు కాల్చుకున్న పవన్ కళ్యాణ్ ఈ సారి సూపర్ హిట్ సినిమా చేసి నిర్మాత గా కూడా సక్సెస్ అవుతాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: