సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. భరత్ అనే నేను సినిమా నుంచి మొదలు పెడితే మహర్షి , సరిలేరు నీకెవ్వరు తాజాగా విడుదల అయిన సర్కారు వారి పాట ఇలా వరుసగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు . 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది . ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతోంది . కొన్ని రోజుల క్రితం పూజా హెగ్డే ను ఈ సినిమా నుంచి తొలగించారు అని వార్తలు వచ్చినప్పటికీ చివరిగా ఈ సినిమాలో పూజా హెగ్డే నే హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు .  ఇప్పటికే తమన్ ఈ సినిమాకు సంబంధించిన పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది . అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇతర స్టార్ కాస్ట్ లను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై రెండో వారం నుండి మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది .  

ఇప్పటికే మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు , ఖలేజా సినిమాలు తెరకెక్కాయి . ఇది వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా. మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: