పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక యు.వి.క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఇక పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లవ్ అడ్వెంచరస్ మూవీగా తెరపైకి వచ్చింది. రాధే శ్యామ్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ అంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ విడుదల తర్వాత మాత్రం ఈ సినిమా ఊహించని ఫలితాన్ని అందుకుంది. కేవలం ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా ఇండియాలోనే పెట్టిన పెట్టుబడికి అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా రాధే శ్యామ్ చెత్త రికార్డును సొంతం చేసుకుంది.ఇంకా ఈ సినిమా రిజల్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు అని చెప్పాలి. మరొకసారి యు.వి.క్రియేషన్స్ నిర్మాణంలో సినిమాలు కూడా చేయకూడదు అని సోషల్ మీడియాలో ఒక దండయాత్ర కూడా చేశారు ప్రభాస్ ఫ్యాన్స్.అయితే ఈ సినిమాకు ఓ వర్గం ప్రేక్షకుల నుంచి మాత్రం కొంత పాజిటివ్ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కనీసం ఓటీటీ లో అయినా ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అనుకుంటే అక్కడ కూడా అసలు అలాంటి రియాక్షన్ ఏమీ రాలేదు. ఎవరు కూడా ప్రభాస్ సినిమాను అసలు పెద్దగా పట్టించుకోలేదు.


ఇక ఇప్పుడు టెలివిజన్ లో రాధే శ్యామ్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఇక ఎప్పటిలానే డిజాస్టర్ సినిమాలను ఏరికోరి సెలెక్ట్ చేసుకునే జీ సినిమాస్ రాధే శ్యామ్ శాటిలైట్ హక్కులను భారీ ధరకు అందుకుంది. ఇక ఈ సినిమాను జీ సినిమాస్ లో త్వరలో టెలికాస్ట్ చేయబోతున్నారు. అలాగే ఇదే నెలలో టెలివిజన్ ప్రీమియర్స్ కు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.అయితే థియేటర్లో ఓటీటీలో చాలా దారుణమైన ఫలితాన్ని అందుకున్న రాధే శ్యామ్ కనీసం టీవీ లో అయినా భారీ స్థాయిలో రేటింగ్స్ అందుకోవాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అత్యధిక టీఆర్పీ అందుకున్న సినిమాలలో అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో సినిమా ఇప్పుడు టాప్ లిస్టులో ఉంది. ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రెండవ స్థానంలో ఉంది. ఇక ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: