ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు రెండు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. వాటిలో ముందుగా
కొరటాల శివ దర్శకత్వంలోని చిత్రం షూటింగ్ జరుపుకోనుంది. జూలై నుంచి ఈ
సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ
సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి ఇంకొకవైపు
ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో ఉండగా అక్కడి నుంచి రాగానే ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తుది చిత్ర యూనిట్.
ఆర్ఆర్అర్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాన్
ఇండియా హీరోగా అవతరించిన
ఎన్టీఆర్ ఈ చిత్రం ద్వారా సోలోగా పాన్
ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకొని క్రేజ్ ను దక్కించుకోవాలని భావిస్తున్నాడు. అందుకే
కొరటాల శివ దర్శకత్వంలో ఈ
మాస్ మసాలా సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇటు
కొరటాల శివ కూడా ఈ చిత్రం ద్వారా ఓ కొత్త రకమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటిదాకా ఆయన చేసిన సందేశాత్మక సినిమాల దారిలో కాకుండా పక్కా కమర్షియల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల పట్ల ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్
హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవైపు పూజాహెగ్డే కూడా ఈ సినిమాలో నటించబోతుందని అంటున్నారు. అయితే ఇంకా ఈ
సినిమా షూటింగ్ మొదలు పెట్టకపోవడంతో
ఎన్టీఆర్ అభిమానులు ఈ
సినిమా ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది ఎప్పుడు
ఎన్టీఆర్ ను తెరమీద చూడాలి అన్న అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక ను గమనించి
కొరటాల శివ ఈ చిత్రాన్ని త్వరగా చేస్తాడా అనేది చూడాలి. ఆచార్య పరాభవం లో ఉన్న
కొరటాల శివ ఈ
సినిమా తో తిరిగి ఫామ్ లోక్ రావాలని చూస్తున్నాడు.