9 ఏళ్ల పాటు సక్సెస్ ఫుల్ షోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జబర్దస్త్ షో నుంచి ఇప్పుడు అందరు బయటకు వచ్చేస్తున్నారు. షో తమని కెరియర్ లో పాపులర్ అయ్యేలా చేయగా బయటకు వచ్చిన వారు కొందరు జబర్దస్త్ షో మీద నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ షో మీద షాకింగ్ కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలిచాడు కిరాక్ ఆర్పీ. జబర్దస్త్ షోతోనే పాపులర్ అయిన అతను షోని వదిలి వచ్చాడు. నాగబాబు ఎప్పుడైతే జబర్దస్త్ ని వదిలి వచ్చాడో అప్పుడే ఆర్పీ కూడా జబర్దస్త్ ని వదిలి వచ్చాడు.

అయితే వచ్చిన ఇన్నాళ్లకు తాను ఆ షోని వదిలి రావడానికి కారణం ఏంటన్నది చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ జబర్దస్త్ లో జరిగే చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చాడు. ముఖ్యంగా జబర్దస్త్ షోని నిర్మిస్తున్న మల్లెమాల టీం జబర్దస్త్ కమెడియన్స్ ని చాలా దారుణంగా అవమానిస్తారని. అసలు అక్కడ ఫుడ్ సరిగా పెట్టరని. షూటింగ్ టైం లో ఏమాత్రం సౌకర్యాలు సరిగా ఉండవని చెప్పుకొచ్చారు.

అంతేకాదు జబర్దస్త్ వల్ల శ్యాం ప్రసాద్ రెడ్డి ఎన్నో కోట్లు వెనకేసుకున్నా సరే కమెడియన్స్ కి ఎవరికైనా ఏదైనా అయితే మాత్రం అసలు పట్టించుకోరని. ఆ బాధలు భరించలేకే షో నుంచి బయటకు వచ్చేసినట్టు చెప్పుకొచ్చాడు ఆర్పీ. అయితే నెలలో రెండు రోజులు మాత్రమే జరిగే జబర్దస్త్ షోలో ఆ రెండు రోజులు ఫుడ్ కోసం ఇంత హంగామా అవసరమా అని ఇంటర్వ్యూయర్ అడిగితే తాను కూడా పెట్టే ఆ రెండు రోజులే మంచి భోజనం పెట్టొచ్చు కదా అని ఆర్పీ అన్నాడు. మొత్తానికి సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జబర్దస్త్ కమెడియన్స్ వెనక జరిగే విషయాలను బయట పెట్టి వారి మీద జాలి పడేలా చేశాడు కిరాక్ ఆర్పీ.


మరింత సమాచారం తెలుసుకోండి: