విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ప్రకాష్ రాజ్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్ర లలో నటించి దేశ వ్యాప్తంగా తన కంటూ నటుడి గా ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు . అలాంటి ప్రకాశ్ రాజ్ తెలుగు లో కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు .

ఇది ఇలా ఉంటే ప్రకాశ్ రాజ్ ఎన్నో మూవీ లలో సాఫ్ట్ పాత్రల్లో నటించడం మాత్రమే  కాకుండా , ఎన్నో మూవీ లలో ప్రతి నాయకుడి పాత్రలో కూడా నటించి మెప్పించాడు . ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజు , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు మూవీ లో ప్రతి నాయకుడి పాత్ర లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అదిరి పోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు .  

తాజా ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ... మహేష్ బాబు హీరో గా నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ లో తన పాత్ర నచ్చక పోయినా అయిష్టం గానే చేయాల్సి వచ్చింది అని తాజా ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు . మరియు కొన్ని సందర్భా లలో నటుల నిర్ణయాలు , అభిప్రాయా లతో పని లేకుండా కొన్ని విషయాలు జరిగిపోతుంటాయి అని కూడా తెలియజేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: