లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సమంత కథనాయకగా నటిస్తున్న ఈ సినిమా యొక్క షూటింగ్ శేర వేగంగా జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చేయబోతున్న తదుపరి సినిమాల గురించి ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది.

పలువురు దర్శకులు ఆయనతో సినిమాలు చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఒకే ఒక జీవితం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీ కార్తీక్ కూడా ఈ జాబితాలో ఉండడం విశేషం. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఎంతో వెరైటీగా ఈ సినిమాను రూపొందించిన ఆయన ఎమోషన్ మిస్ అవ్వకుండా సినిమా మొత్తాన్ని అలరించాడు. ఆ విధంగా అన్ని అంశాలు సమకూరిన ఈ సినిమాను చూడడానికి ఇప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కలుగుతుంది. 

విజయ్ దేవరకొండ నోటా సినిమా చేస్తున్న సమయంలోనే ఈ దర్శకుడు తో కలిసి సినిమా చేయవలసి ఉంది. కానీ అప్పటి పరిస్థితుల మేరకు విజయ్ దేవరకొండసినిమా చేయడానికి నో చెప్పాడు అయితే ఈ దర్శకుడు తో చేయవలసిన సినిమా యొక్క అడ్వాన్స్ ని తీసుకోవడంతో ఈ డైరెక్టర్ దర్శకత్వంతో సినిమా చేయవలసిన అవసరం విజయ్ దేవరకొండకు ఇప్పుడు ఏర్పడింది. దాంతో ఈ దర్శకుడు ఒక మంచి కథను రెడీ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నడటంతో ఈ హీరో ఈ దర్శకుడు తో కలిసి సినిమాను ఎప్పుడు చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: