పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రేక్షకులలో ఎంత ఆదరణ పొందారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా వేడులకలోనే కాదు ఇతర హీరోల సినిమా వేడుకల్లోనూ పవర్ స్టార్ అన్న నినాదాలు వినిపిస్తుంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో మామూలు స్పీడు పెంచలేదు.
పవన్ ఒకదాని తర్వాత ఒకటి వరసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఈ ఏడాది తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు పవన్. 2017 సంక్రాంతికి రిలీజైన ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ ఈ ఏడాది తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ను పవన్ ప్రధాన పాత్రలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను కోలీవుడ్లో అజిత్ హీరోగా రీమేక్ చేసి సక్సెస్ అయిన బోనీ కపూర్ తెలుగు వర్షన్ కూడా నిర్మించనున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.
వేసవిలో తన 26వ సినిమాతో ‘వకీల్ సాబ్’గా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మే 15న ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇదే సంవత్సరం మరో క్రేజీ ప్రాజెక్ట్తోనూ కిక్ ఇవ్వనున్నాడు పవర్ స్టార్. పవన్, క్రిష్ దర్శకత్వంలో నటించనున్న పిరియాడిక్ ఫిల్మ్.. ఆగస్టు నాటికి చిత్రీకరణ పూర్తిచేసుకుని దీపావళి కానుకగా నవంబర్ 13న రిలీజ్ కానుందని సమాచారం. పవన్ ఒకే సంవత్సరంలో రెండేసి సినిమాలతో ఎంటర్టైన్ చేయడం ఇదే తొలిసారి కాదు.
ఇంతకుముందు 1998లో ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ’.. 2006లో ‘బంగారం’, ‘అన్నవరం’, 2011లో ‘తీన్ మార్’, ‘పంజా’.. 2012లో ‘గబ్బర్ సింగ్’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలతోనూ సందడి చేశాడు. ఇప్పుడు ఐదోసారి కూడా డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు పవన్... 1998 నాటి మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.