రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంలో రైజింగ్
హీరోయిన్ పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమాలో నుండి తాజాగా పూజ రోల్ రివీల్ అయ్యింది.
బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె మ్యూజిక్ టీచర్ గా కనిపించనుందట.
జిల్ ఫేమ్
రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే
జార్జియా లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకోగా తదుపరి షెడ్యూల్
హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగనుంది. కృష్ణం రాజు, భాగ్య శ్రీ కీలక పాత్రల్లో నటిస్తుండగా ఈ చిత్రానికి ఓ డియర్ లేదా రాధే
శ్యామ్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గోపి
కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా
అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. తెలుగు తోపాటు
తమిళ హిందీ భాషల్లో విడుదలకానుంది. అలాగే అతి త్వరలో ఈసినిమా కు సంబంధించి ఓ అప్డేట్ రానుందట.