అలా వైకుంటాపురంలో సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించాడు. ఇక ఈ సినిమాతో అల్లు రేంజ్ మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే  అల్లు అర్జున్ పుట్టినరోజు  సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. కరోనా సందర్భంగా చాలా లేటుగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు.ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో నటించనున్నట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్..వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుళ్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో సినిమా కూడా చేయబోతున్నారు. అయితే పుష్ప లాగానే అల్లు అర్జున్ ఇంకొక తన పాత డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నారు. అది ఎవరో కాదు తనతో పరుగు లాంటి మంచి సినిమా తీసిన బొమ్మరిల్లు భాస్కర్ కి అల్లు అర్జున్ ఇంకొక ఛాన్స్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకొని విడుదలకి రెడి గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: