సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం " సర్కారు వారి పాట " అనే మూవీలో నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60శాతం దాకా పూర్తి అయ్యిందని సమాచారం. ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదల అయిన మహేష్ బాబు ప్రీలుక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఇక ఈ మూవీ తరువాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. హారిక అండ్ హాసినీ క్రియెషన్స్ బ్యానర్ లో ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్రివిక్రమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే పలు రకాల గాసిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. అదేమిటనగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉందట. అయితే సెకండ్ హీరోయిన్ గా "జాతి రత్నాలు " భామ ఫరియా అబ్దుల్లా సెలక్ట్ అయినట్లు సమాచారం. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ప్రస్తుతం ఈ భామ "జాతి రత్నాలు " తరువాత ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు.  ఒకవేళ మహేష్ బాబు పక్కన ఈ భామ నటిస్తే మాత్రం, ఫరియా స్టార్ హీరోయిన్ లీడ్ లోకి చేరిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: