సినీ పరిశ్రమలోకి బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా అగ్రస్థానాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. అటువంటి దాన్ని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు తన టాలెంట్‌తో సాధించాడు. ఎప్పటికప్పడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక అతడి డైలాగ్ డెలివరీ, స్టైల్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక అమ్మాయిలకైతే కలల రాకుమారుడు అయ్యాడు. మహేష్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడి సినిమాలంటే భారీ క్రేజ్ ఉంటుంది. అయితే మహేష్ నుంచి కొత్త సినిమా విడుదలయ్యి ఏడాది అయింది.


 సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ మరో సినిమాను ప్రకటించలేదు. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన మహేష్ తాజాగా చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం మహేష్సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రయత్నించింది. కానీ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పోరులో దించాలని నిశ్చయించుకుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  అభిమానులు ఈ సినిమాపై ప్రారంభం నుంచి భారీ అంచనాలు పెట్టుకున్నారు.



 ఇక ఇటీవల విడుదలైన పోస్టర్‌లు సినిమాపై ఉన్న అంచనాలను మరింత అధికం చేశాయి. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త రూమర్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నెల చివరిలో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది.



 అయితే అప్పుడు వచ్చే అప్‌డేట్ ఏమై ఉంటుందని అభిమానులు ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలు పెట్టారు. గతేడాది ఇదే సమయానికి ఓ ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కానీ ఈ ఏడాది మాత్రం అభిమానులకు మహేష్ భారీ ట్రీట్ ప్లాన్ చేస్తున్నాడని, మే 31 ఈ సినిమా టీజర్, లేదా ఫస్ట్ గ్లింప్స్ వస్తుందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: