యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌... గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన, డైలాగులు, డ్యాన్స్‌ లతో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఎన్టీఆర్‌. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల గుండెల్లో యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌.. మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. నందమూరి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ... తన నటనతోనే యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎంతో పాపులర్‌ అయ్యారు. ప్రస్తుత టాప్‌ హీరోల్లో యంగ్‌ టైగర్‌ ఒకడు. అయితే.. ఇది ఇలా ఉండగా...  యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌... నిన్న ఓ తహసీల్దార్‌ ఆఫీస్‌ లో ఒక్కసారిగా దర్శనమించారు. 

నిన్న సాయంత్రం అంటే... శుక్రవారం రోజున రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చారు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌. దీంతో   తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న అధికారులు, ఇతరులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. అంతేకాదు... సెల్ఫీల కోసం ఎగబడ్డారు అధికారులు. అయితే...ఓ భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో శంకర్‌ పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి  జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చారని సమాచారం అందుతోంది.   శంకర్‌ పల్లి మండల పరిధిలో ఉన్నటు వంటి... గోపాలపురం గ్రామంలో ఏకంగా ఆరున్నర ఎకరాల లాండ్‌ను జూనియర్‌ ఎన్టీఆర్‌ కొన్నాడని తెలుస్తోంది. 

అయితే... ఈ ఆరున్నర ఎకరాల లాండ్‌కు సంబంధించిన వ్యవహారంపై శంకర్‌ పల్లి తహసీల్దార్‌ అధికారులతో జూనియర్‌ ఎన్టీఆర్‌ మాట్లాడినట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే శంకర్‌ పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి ఎన్టీఆర్‌ వెళ్లారని సమాచారం. ఇక శంకర్‌ పల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగానే.. అక్కడ ఉన్న జనాలతో పాటు అధికారులు కూడా సెల్ఫీలు కోసం ఎగబడ్డారు. అయితే.. అక్కడ ఉన్నవారిని ఎవరినీ నిరాశ పరచకుండా... వారందరితో ఫోటోలు దిగారు జూనియర్‌ ఎన్టీఆర్‌. కాగా.. ప్రస్తుతం రాజమౌళి  దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ  ఆర్‌ఆర్‌ఆర్‌  సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

ntr