జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే సుధీర్ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ హీరోగా బిజీ అయ్యాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు పలు టీవీ షోస్ లో కనిపించాడు. అయితే గత కొంతకాలంగా టీవీ షోలకు పూర్తిగా దూరంగా ఉన్న సుడిగాలి సుధీర్ మళ్లీ హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి సుడిగాలి సుదీర్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. కాగా షోకి ఫ్యామిలీ స్టార్స్ అని

 టైటిల్ని కూడా ఫిక్స్ చేశారు. ఈటీవీలో ఈ కామెడీ షో టెలికాస్ట్ కాబోతోంది. అంతేకాదు ఈ వారంలోని ఫ్యామిలీ స్టాక్స్ షో టెలికాస్ట్ డేట్ ను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా ఈ షో కి పోస్ట్ గా సుడిగాలి సుధీర్ వ్యవహరించ బోతున్నాడు. కాగా ఈ విషయాన్ని ఈటీవీ ప్రోమో ద్వారా తెలపడం జరిగింది. దళపతి విజయ్ లియో సినిమా స్పూఫ్ స్కిట్ తో సుడిగాలి సుధీర్ హోస్ట్ అన్న విషయం బయటపడింది. ఇక ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ  సుధీర్ బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు ఒకింత సంతోషం వ్యక్తం

 చేస్తున్నారు. ఆటచూస్తావా అంటూ ఈ ప్రోమోలో సుధీర్... మహేష్‌బాబు డైలాగ్ చెప్పడం హైలైట్‌గా ఉంది. ది ఎంటర్‌టైనర్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ ప్రోమోలో సుధీర్‌ను ఉద్దేశించి క్యాప్షన్ కనిపిస్తోంది. సినిమా, బుల్లితెర నటులు తమ ఫ్యామిలీతో కలిసి ఈ షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఆటపాటలతో అభిమానులకు నవ్వులను పంచబోతున్నట్లు తెలుస్తోంది.  సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో గత ఏడాది జబర్ధస్థ్‌కు గుడ్‌బై చెప్పాడు సుధీర్‌. 2013లో జబర్ధస్థ్‌లో కంటెస్టెంట్‌గా జర్నీని మొదలుపెట్టిన సుధీర్‌...2023తో ఈ షోతో అనుబంధాన్ని ముగించారు. జబర్ధస్థ్‌కు అతడు గుడ్‌బై చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. జబర్థస్థ్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంటూనే ఈటీవీలో టెలికాస్ట్ అవుతోన్న ఢీ, పోవేపోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్‌గా పనిచేశాడు. ఇవన్నీ అతడికి మంచి పేరుతెచ్చిపెట్టాయి. సుధీర్ కామెడీ టైమింగ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ షోలే కారణమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: