గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ వార్తను చూసిన చాలా మంది అభిమానులు మొదట ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేశారు. “అలాంటిదేమీ లేదు, తారక్ అలా చేయడం అసంభవం” అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. కానీ ఇప్పుడు ఆ వార్త నిజమని అధికారికంగా ప్రకటించడంతో, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆనందం అలజడిగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో పవర్‌ఫుల్ వాయిస్ కలిగిన స్టార్ హీరోల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎప్పుడూ టాప్‌లో ఉంటుంది. ఆయన గొంతు , డైలాగ్ డెలివరీలోని ఎనర్జీ, ఎమోషన్ — ఇవన్నీ కలిపి ఆడియన్స్‌లో ప్రత్యేకమైన ఫీల్‌ను క్రియేట్ చేస్తాయి. అందుకే ఆయన వాయిస్‌తో వచ్చే టీజర్లు, ట్రైలర్లు లేదా క్లీన్స్ వీడియోలు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వైరల్ అవుతాయి.ఇలా కొన్నాళ్ల క్రితం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ సినిమాలో తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఆ టీజర్ విడుదలైన క్షణాల్లోనే ట్రెండింగ్‌లోకి వెళ్లి, తారక్ వాయిస్‌కు వచ్చిన రీస్పాన్స్ చూసి ఇండస్ట్రీ మొత్తమే ఆశ్చర్యపోయింది.

ఇప్పుడు మరోసారి అటువంటి అద్భుతం జరగబోతోంది. తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ మరో పెద్ద ప్రాజెక్ట్‌కు తన వాయిస్ ఇవ్వబోతున్నారు. అదే ‘సామ్రాజ్యం’ సినిమా. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే — కొంతకాలం క్రితం ‘కింగ్డమ్’ చిత్రానికి మొదట పరిగణనలోకి తీసుకున్న టైటిల్స్‌లో “సామ్రాజ్యం” కూడా ఒకటి. ఆ సినిమా హిందీ వెర్షన్ కూడా ‘సామ్రాజ్య’ అనే పేరుతో విడుదలైంది. ఇప్పుడు, కొంత గ్యాప్ తర్వాత అదే పేరుతో మరో కొత్త సినిమా వస్తుండగా, ఆ సినిమాకి కూడా తారక్ తన వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక రకంగా సింబాలిక్‌గా, సెంటిమెంట్‌గా మారింది.

ఈ ‘సామ్రాజ్యం’ చిత్రం కోలీవుడ్ సెన్సేషన్, నటుడు-శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ తమిళ ఇండస్ట్రీలోనే కాక, మొత్తం దక్షిణ భారత సినీ రంగంలోనూ భారీ క్రేజ్ క్రియేట్ చేస్తోంది.తారక్ వాయిస్ ఓవర్ ఈ ప్రాజెక్ట్‌కు అదనపు బూస్ట్‌గా మారనుంది. ఆయన వాయిస్‌తో కూడిన నరేషన్ సినిమా స్థాయిని మరింత ఎలివేట్ చేస్తుందని టీమ్ నమ్మకం. ఇక అభిమానుల విషయానికి వస్తే — తారక్ వాయిస్ ఎక్కడ వినిపించినా సోషల్ మీడియాలో ఆ ఒక్క సౌండ్ బైట్‌నే టాప్ ట్రెండ్‌గా మార్చేస్తారు.

మూవీ నుండి ఒక ప్రత్యేక గ్లింప్స్ వీడియోను అక్టోబర్ 17, శుక్రవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే ఆ అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రస్తుతం “సామ్రాజ్యం” మూవీ, “జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్” అనే రెండు ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. అభిమానులు ఈ గ్లింప్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తారక్ వాయిస్‌తో వచ్చే ఆ వీడియో మరొకసారి రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, “సామ్రాజ్యం” సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ మరోసారి దక్షిణాది సినీ ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: