ముందుగా తెలుగు టెలివిజన్ తెరపై యాంకర్లుగా మెరిసి, మెల్లగా వాటి ద్వారా మంచి పేరును సంపాదించి, ఆపై కొన్నాళ్ళకు సినిమా అవకాశాలు కూడా దక్కించుకుని, ప్రస్తుతం మంచి పేరుతో దూసుకెళ్తున్న లేడీ యాంకర్లు అనసూయ మరియు రష్మీ. అయితే అనసూయ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ ద్వారా పరిచయం కాగా, రష్మీ అప్పటికే పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దిరికీ ఒకరకంగా మంచి పేరు తీసుకువచ్చి, కెరీర్ పరంగా బ్రేక్ నిచ్చిన ప్రోగ్రాం ఒక్కటే కావడం విశేషం. కొన్నేళ్ల క్రితం నుండి ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతూ వస్తున్న జబర్దస్త్ షో ద్వారా వీరిద్దరూ తమ ఆకట్టుకునే యాంకరింగ్ ప్రతిభతో, ఆ షోకు మరింత పేరు తీసుకువచ్చారు.

అయితే ఆ షోకు కొన్నాళ్ళు అనసూయ, మరికొన్నాళ్లు రష్మీ యాంకరింగ్ చేసేవారు.  అయితే ఇటీవల మాత్రం జబర్దస్త్ షోకు అనసూయ, అలానే ఎక్స్ట్రా జబర్దస్త్ షోకు రష్మీ యాంకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆ షో సూపర్ సక్సెస్ తరువాత ఇద్దరికీ మంచి గుర్తింపు లభించి, మరిన్ని షోలలో నటించే ఛాన్స్ తో పాటు సినిమా అవశాలు కూడా దక్కాయి. అయితే ఎవరికి వారు ఆకట్టుకునే మంచి ప్రతిభ గల ఈ యాంకర్లకు అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. తమ షూటింగ్స్, ఫోటో షూట్స్ తదితర విషయాలను ఈ ఇద్దరూ కూడా ఎప్పటికపుడు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక కొద్దిరోజుల నుండి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వీరి అభిమానుల మధ్య చిన్నపాటి పోటీ జరుగుతోంది. నిజానికి క్షణం, రంగస్థలం సినిమాల్లో తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల మదిని అనసూయ గెలుచుకుంటే, 

ప్రస్థానం, గుంటూరు టాకీస్, తను వచ్చెనంట, నెక్స్ట్ నువ్వే వంటి సినిమాల్లో నటనతో రష్మీ మంచి పేరు సంపాదించారు. ఇక ప్రస్తుతం ఈటీవీలో ప్రదర్శితం అవుతున్న జబర్దస్త్ తో పాటు ఢీ జోడి ప్రోగ్రాంకు రష్మీ, అలానే జీతెలుగులో డ్రామా జూనియర్స్ అనే షోకు అనసూయ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు. ఒకరకంగా వీరిద్దరూ కూడా అన్ని విషయాల పరంగా దాదాపుగా సమమోజ్జీలేనని పలువురు అభిప్రాయపడుతున్నప్పటికీ, వారి వారి అభిమానులు మాత్రం వినడం లేదు. అయితే ఏది ఏమైనా మొత్తంగా చూస్తే, వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటూ సాగుతున్న ఈ రసవత్తర పోటీలో అద్భుతమైన టాలెంట్ కలిగిన ఈ ఇద్దరూ కూడా విజేతలే అంటున్నారు సినీ విశ్లేషకులు.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: