చంద్రబాబు కుటుంబ సభ్యులే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు  ఆంధ్ర‌ప్ర‌దేశ్ సివిల్ స‌ప్లై శాఖా మంత్రి కొడాలి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మానసిక స్థితి కోల్పోయి చంద్రబాబు మాట్లాడుతున్నార‌ని, జగన్ దెబ్బకు చంద్రబాబుకు పిచ్చెక్కింది అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజనకు మద్దత్తు ఇచ్చి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాకు లాగా చేశాడు అని చంద్ర‌బాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. వరుస ఓటములతో ఎన్నికలు అంటే చంద్రబాబు బయపడుతున్నారంటూ మాట్లాడారు.


   బద్వేల్ ఉప ఎన్నిక అనగానే చంద్రబాబు పారిపోయాడని, చంద్రబాబును ప్రజలు నమ్మాలి అంటే ముందు చంద్రబాబు లోకేష్ ని నమ్మాలి అంటూ ఎద్దేవా చేశారు. పుత్రుడుపై నమ్మకం లేక దత్త పుత్రుడును చంద్రబాబు దగ్గరకు తీసుకుంటున్నాడు అని అన్నారు. జనసేన టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉంది అని అనుమానం వ్య‌క్తం చేశాడు. జనసేన కమ్మోళ్లకు అండగా ఉండటం ఏంటి అని ప్ర‌శ్నించారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ తల ఊపుతున్నాడ‌ని ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి  కొడాలి నాని. 



టీడీపిని జనసేనలో  విలీనం చెయ్యండి అంటూ సూచించారు. డ్రగ్స్ తో ఏపీకి  సంబంధం లేదని కేంద్ర సంస్థలు నిర్దారణకు వచ్చాయి అని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. చంద్రబాబు హెరిటేజ్ మార్ట్స్ ద్వారా  డ్రగ్స్ సప్లై చేసారా అని అనుమానం వ్య‌క్తం చేశారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ రక్తంలోనే లేవు అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. గంజాయి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నారు అని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు.


 ఇన్కమ్ టాక్స్ ఎగ్గొట్టి చంద్రబాబు  వెలకోట్లకు పడగలెత్తాడు అంటూ మంత్రి కొడాలి నాని ఆరోపించాడు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రధాని గట్టి చర్యలు తీసుకుంటున్నారు అని ఈ సంద‌ర్భంగా తెలిపారు కొడాలి.  పివి నరసింహారావు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తే.. నేనే  పెట్టా అని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారు అని మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: