మార్క్ మోబియస్ ప్రపంచ స్టాక్ మార్కెట్ కింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనా గొప్ప ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ పెట్టుబడుల విషయంలో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ వారి చూపు మాత్రం దేశంపైనే ఉన్నదని, అందుకే వారందరు పెట్టుబడులు కేవలం ఇక్కడే పెట్టడానికి సుముఖంగా ఉన్నారు. ఇదంతా భారత్ కు కలిసి వచ్చే కాలం. గతంలో ఇలాంటి పరిస్థితి రావాల్సి ఉండగా, చైనా గద్దలా వచ్చి తన్నుకుపోయి, ఇప్పటి వరకు కులికింది. ఇప్పటికైనా భారత్ మరోసారి స్వయంకృషితో అవకాశాన్ని దక్కించుకుంటుంటే అక్కసుతో యుద్ధాలకు తెగబడుతుంది.
ప్రస్తుతం తైవాన్ పై కానీ భారత సరిహద్దులలో కానీ చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం వెనుక ఇదే ఉద్దేశ్యం తప్ప మరొకటి లేదు. భారత్ ఎప్పుడు తనను మించిపోతుందేమో అనే భయం తప్ప చైనాలో మరొకటి లేదు, ఆ భయం ఇటీవల బాగా పెరిగినట్టుగానే ఉంది అందుకే, యుద్ధం చేయడానికి కూడా పూనుకుంటుంది. అసలు దాని పరిస్థితే దిక్కుతోచని విధంగా ఉన్నప్పటికీ యుద్దానికి సన్నాహాలు చేస్తూ ఉండటం తోనే ఊహించవచ్చు, దానికి భారత్ అంటే ఎంతభయంగా ఉన్నదో అని.