ఆడు మాట్లాడితే సునామీ సూసినట్లుంటాది
ఏంది జగన్ సామీ ఇంటున్నావా
ఆడితో ఆట్లాడావు ఆడు నీతో ఆడ్లడతాండు
కాట్లాడతాండు..ఇక మీరు సిద్ధంగా ఉండుండ్రి!
సినిమా ప్రపంచంలో ఇంత కాలం ఉన్న తీరు వేరు.ఇప్పుడున్న తీరు వేరు.ఒకప్పుడు సినిమా తీయడం కష్టం.విడుదల సులువు. ఇప్పుడు తీయడం సులువు.విడుదల కష్టం.కేవలం ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని వ్యవస్థకు రుద్ది తన పంతం నెగ్గించుకోవడం ఒక్క వైసీపీకే చెల్లు.పోనీ అన్ని విషయాల్లో అదే నిబద్ధతతో ఉంటున్నారా అంటే అదీ లేదు.ఈ నేపథ్యంలో ఆర్జీవీ మాట్లాడాడు. అగ్గి రాజేశాడు.మామూలుగా కాదు పేర్ని నాని అనే మంత్రిని టార్గెట్ చేశాడు.ఆ రోజు వైసీపీ వాళ్లంతా ఆర్జీవీని వాడుకున్నారు. ఇప్పుడు ఆర్జీవీ వాళ్లతోనే ఆడుకునేందుకు సిద్ధం అయి ఉన్నాడు. దటీజ్ ఆర్జీవీ.
వివాదాలను ఇంటి పేరుగా చేసుకుని మాట్లాడే సత్తా ఒక్క ఆయనకే ఉంది.వైసీపీ వాళ్లు చాలా కాలం ఆయనను వాడుకున్నారు.అలాంటి వైసీపీకే వెన్నుపోటు పొడిచి మాట్లాడగలిగే సత్తా కూడా ఆయనకే చెల్లు.ఆ రోజు అమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ నా నా హడావుడి చేసిన ఆర్జీవీ ఇప్పుడు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాడు. ఒరేయ్ ఆర్జీవీ థాంక్ యూ రా లవ్ యూ అని ప్రతి సినీ అభిమానీ తలెత్తుకునేలా చేయగలుగుతున్నాడు.అదిరా ఆర్జీవీ! ఆడ్రా! మగాడు అని చెప్పగలిగే సత్తా ఆయనకు మాత్రమే చెందే మాట! మిగతా వారంతా భయస్తులు మరియు పిరికిపందలు.ఆఖరికి చిరు,బాలయ్య,వెంకీ,నాగ్ తో సహా! వీరి కన్నా ఇప్పుడు మాట్లాడుతున్న ఆర్జీవీ ఎంతో బెటర్. ఇప్పుడీయన మాటల ప్రభావంతో రేపు నానీ ఏం మాట్లాడతాడో మరి! డు కాదు రు.. ఆర్జీవీ వచ్చాడుగా రూల్ మారాలి రూలింగ్ మారాలి..