ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం, మీరు పోరాడారు... ఓడినందుకు మాకేమీ బాధలేదని ట్వీట్ చేయడం వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. ప్రస్తుతం వీరు దూరమైంది బంగారు పతకానికి మాత్రమే. కాంస్యం పతకం గెలిచేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉంటే హాకీ విభాగంలో సెమీఫైనల్ అడనున్న మహిళల టీమ్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. పురుషుల జట్టు ఓటమి పాలవ్వడంతో భారత్ అభిమానులు అంతా వీరిపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. రేపు జపాన్ సమయం ప్రకారం సాయంత్రం 7 గంటలకు అర్జెంటీనా తో సెమీఫైనల్ లో తలపడనుంది.
ఈ మ్యాచ్ కనుక గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే. అర్జెంటీనా ను అంత తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఏ మాత్రం అవకాశం ఇచ్చినా మ్యాచ్ చేజారినట్లే. ఇంతకు ముందు చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా సమిష్టిగా పోరాడితే ఫైనల్ కు చేరుకోవడం అంతా కష్టమేమీ కాదు. వరుసగా మూడు మ్యాచ్ లు ఓడినా, పుంజుకున్న తీరు అమోఘం. ఇదే ఉత్సాహంతో అర్జెంటీనాను ఓడిస్తే చాలు...భారతదేశ అభిమానులు సంతోషంతో ఒప్పొంగిపోతారు. కమ్ ఆన్ గర్ల్స్...యు కెన్ విన్ గోల్డ్ మెడల్... ఆల్ ది బెస్ట్...!