ఇంకో నెలన్నర రోజులలో యూఏఈ లో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కాసేపటి క్రితమే బీసీసీఐ నుండి జయదేవ్ షా ఇండియన్ జట్టును ప్రకటించారు. అయితే ఇందులో చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అభిమానులకు ఒకింత ఆనందాన్ని మరో వైపు విచారాన్ని కలిగిస్తోంది. ఈ టీం అయితే అందరూ ఊహించిన విధముగా లేదు. అయితే జట్టు కూర్పు ఎలా అదో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ టీం కు విరాట్ కోహ్లీ సారధ్యాన్ని వహిస్తున్నాడు. టాప్ ఆర్డర్ ప్లేయర్స్ గా రోహిత్ శర్మ, కె ఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరిలో ఇద్దరు ఓపెనర్లుగా ఉండే అవకాశం ఉంది.ఇక వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ రానున్నాడు. సూర్య కుమార్ యాదవ్ సెకండ్ డౌన్ లో వచ్చే అవకాశం ఉంది. ఇక వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేశారు.

రిజర్వు కీపర్ గా ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇక అల్ రౌండర్ ల విషయానికొస్తే హార్దిక పాండ్య, రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ ఉన్నారు. రిజర్వ్ అల్ రౌండర్ గా కృనాల్ పాండ్య ఉన్నాడు. ఇక బుమ్రా, భువనేశ్వర్, మహమ్మద్ షమీ పేస్ విభాగాన్ని చూసుకోనున్నారు. అయితే అందరినీ ఆశ్చర్య పరిచే నిర్ణయం ఏమిటంటే, స్పిన్నర్లుగా ఇంటర్నేషనల్ అనుభవం లేని వారిని తీసుకోవడం. ఐపీఎల్ లో రాణించిన రాహుల్ చాహర్ మరియు వరుణ్ చక్రవర్తి లను స్పిన్నర్ లుగా ఎంపిక చేశారు. మరో స్పిన్నర్ గా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉండడం ఇండియాకు కలిసొచ్చే అంశం. గత కొద్ది సంవత్సరాలుగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో స్పిన్నర్లుగా ర్ణయిస్తున్న యుజ్వేంద్ర చాహల్ మరియు కుల్దీప్ యాదవ్ ఇద్దరికీ సెలెక్టర్లు మొండి చేయి చూపారు.

ఇది అందరికీ షాకింగ్ నిర్ణయం అని చెప్పాలి. అంతే కాకుండా నాలుగు సంవత్సరాల తర్వాత భరత్ టీ 20 ఇంటర్నేషనల్ టీం లో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక శ్రీలంక పర్యటనలో ఇండియాకు కెప్టెన్ గా ఉన్న శిఖర్ ధావన్ కు నిరాశ తప్పలేదు. రిజర్వు ప్లేయర్లుగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ మరియు దీపక్ చాహర్ ఎంపికయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: