ఇలా క్రమక్రమంగా చాలా రోజుల పాటు కె.ఎల్.రాహుల్ జట్టులోకి దూరమయ్యాడు అనే చెప్పాలి. భారత జట్టులో కీలక ఆటగాడు కావడంతో మరికొన్ని రోజుల్లో యూఏఈ వేదికగా ప్రారంభం కాబోయే ఆసియా కప్లో భాగంగా భారత జట్టు యాజమాన్యం అతనికి టీంలో అవకాశం కల్పించింది. అతని ఫామ్ నిరూపించుకునేందుకు ఇటీవల జింబాబ్వే పర్యటనలో భాగంగా అతనికి అవకాశం కల్పించింది అన్న విషయం తెలిసిందే. కాగా అతనికి ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అని తెలుసుకోవడానికి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారూ.
ఈ క్రమం లోనే మొదటి మ్యాచ్లో భాగం గా అతనికి ఆడే అవకాశం కూడా రాలేదు. ఇక రెండో మ్యాచ్లో బరిలోకి దిగినప్పటికీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వికెట్ కోల్పోయి ఘోరం గా నిరాశపరిచాడు. దీంతో ఇంకో వారం రోజుల్లో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యం లో అతడి ఫాం పై అభిమానులు సర్వత్రా ఆందోళన నెలకొంది అని చెప్పాలి. ఇదే విషయంపై స్పందించిన మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్ ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అతడు ఫామ్ లోకి రావడానికి ఒక్క మ్యాచ్ చాలు అంటూ చెప్పుకొచ్చాడు.