*ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ వీ4.0 టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇక ఈ వాచ్ను కేవలం రెండు గంటల్లోనే చాలా ఫాస్ట్ గా ఫుల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
*ఇక ఈ స్మార్ట్ వాచ్ 1.3 ఇంచెస్ టీఎఫ్టీ ఎల్సీడీ టచ్ స్క్రీన్, 240 x 240 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి వుంది.అలాగే ఇది ఆండ్రాయిడ్ 5.1, ఇంకా ఐవోఎస్ 9.0 ఆ పై ఆపరేటింగ్ సిస్టంలకు కూడా సపోర్ట్ చేస్తుంది.
*ఇక స్టైలిష్ స్మార్ట్ వాచ్ రియల్టైమ్ హార్ట్ రేట్ మానిటర్తో పాటుగా వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, స్కిప్పింగ్ వంటి ఇతర స్పోర్ట్స్ మోడ్స్ను కూడా ఇది చాలా ఫాస్ట్ గా సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఇందులో ఉంది.
*ఇక కెమెరా విషయానికి వస్తే...ఈ స్మార్ట్ వాచ్ కి రిమోట్ కెమెరా ఫీచర్ దీనికి ప్రత్యేకత అని చెప్పాలి..ఈ కెమెరా ద్వారా వాచ్ నుంచే కనెక్ట్ చేసిన ఫోన్లో ఫొటోలు తీయవచ్చు.
*మార్కెట్ లో స్మార్ట్ వాచెస్ కి పెరుగుతోన్న పోటీకి అనుగుణంగానే జియోనీ కంపెనీ సరి కొత్త ఆలోచనతో చౌక ధరలో ఈ కొత్త స్మార్ట్ వాచ్ను లాంచ్ చేసింది. ఇక జియోనీ స్టైల్ఫిట్ జీఎస్డబ్ల్యూ7 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర కేవలం రూ. 2,099గా కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక వారంటీ విషయానికి వస్తే ఈ వాచ్పై ఒక సంవత్సరం వారంటీ, అలాగే స్ట్రాప్పై ఆరు నెలల వారంటీని కంపెనీ వారు ఇస్తున్నారు.