ఏమి లేనివాల్లు వ్యాపారం చేస్తున్నారు అంటే కుటుంబ పోషణ కోసం అనుకోవచ్చు..కానీ ఒంటి మీద భారీగా నగలను పెట్టుకొని మరీ వీధి వ్యాపారం చేసే వాళ్ళను బహుశా చూసి ఉండరు. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ వ్యక్తి మాత్రం ఒంటి నిండా నగలను వేసుకొని ఫలుద అమ్ముతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..ఏమిటి నిజమా అని ఆశ్చర్య పోకండి..నిజమే..



ఫలూదా అమ్మే వ్యక్తే పేద్ద స్పెషల్ అట్రాక్షన్.ఈ స్పెషల్ ఏమిటంటే.. అలా ఫలుడా అమ్మే వ్యక్తి.. తన ఒంటినిండా బంగారు నగలు ధరించి మరీ ఫలూదా అమ్ముతున్నాడు. అతని ఒంటిమీద సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. ఇంత బంగారం వేసుకున్నప్పుడు అతడు చిన్నపాటి వ్యాపారం ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటీ అనే డౌట్ కూడా వచ్చి తీరుతుంది. దానికి కూడా సమాధానం ఉందండోయ్..అతని దగ్గరి వింత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..



నట్వర్ నేమా అనే వ్యక్తి ఒంటిమీద రెండు కిలోల బరువుండే బంగారు నగలు ధరించి మరీ ఇండోర్‌లోని సరాఫా చౌపటీలో రబ్రీ ఫలుడా అమ్ముతున్నాడు. ఫలూడా తినేందుకు షాప్ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కచ్చితంగా ఈ 'గోల్డ్ మ్యాన్'తో సెల్ఫీ దిగుతారు. మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్ విభిన్న రుచులకు ప్రసిద్ధి. ఈ నగరానికి వచ్చేవారు చాలామంది ఖచ్చితంగా ఒకసారైనా సరాఫా చౌపటీని సందర్శిస్తారు. ఈ మార్కెట్‌లో బంగారం, వెండిని విక్రయిస్తారు. అదే రాత్రి సమయం లో, ఈ స్ట్రీట్ చోరీ వీధిగా మారుతుంది. ఇక్కడే 'గోల్డ్‌మన్ బాబా' అంటే నట్వర్ నేమా రబ్రీ కుల్ఫీని విక్రయిస్తాడు. అతను అమ్మే ఫలుడా ఎంత ప్రసిద్ధి చెందిందో.. అదే విధంగా అతను ఓ లోకల్ సెలబ్రెటీ హోదాను దక్కించుకున్నారు. ఎందుకంటే నట్వర్ రెండు కిలోల బంగారం ధరించి దుకాణం వద్ద కూర్చుంటాడు..అదే ఆయన స్పెషల్ వ్యాపారం పెంచుకోవడం కోసం వాడే టెక్నిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: