మా ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మూకుమ్మడిగా రాజీనామా చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రకాష్ మాట్లాడుతూ... మేము ఏదైనా ఓకే ప్యానెల్ నుంచి ఎన్నుకోవాలని కోరుకున్నాం అన్నారు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో రౌడీ యిజం జరిగిందని సంచలన కామెంట్స్ చేసారు. బ్యాలెట్ పద్దతిలో తప్పు జరిగింది అన్నారు. అయనా..ఎన్నికలు ఆపకూడదని ఊరుకున్నాం అని తెలిపారు. పోలింగ్ దగ్గర మోహన్ బాబు వచ్చి కూర్చున్నాడు అని మండిపడ్డారు. బెనర్జీ మీద చెయ్యి వేసారు అని రాత్రి రిజల్ట్స్ అన్నారు.. చూస్తే..తెల్లారి రిజల్ట్స్ మారాయి అంటూ విమర్శించారు.  ఇలాంటి వాతావరణం లో మేము పనిచేయగలమా అని మా ప్యానెల్ లో గెలిచిన వారు నా దగ్గర సందేహం వ్యక్తం చేస్తున్నారు అన్నారు. మా ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నాం అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: