గత కొన్ని రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 79 మంది కరోనా భారీన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1275కు చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో ఎవరూ మృతి చెందలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 30 మంది కరోనా భారీన పడి చనిపోయారు. రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. గత పది రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. కానీ గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం గమనార్హం,. 

మరింత సమాచారం తెలుసుకోండి: