ఆంధ్రప్రదేశ్ లో సిఎం వైఎస్ జగన్ ఏడాది పాలన విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల యుద్ధం మాత్రం ఒక రేంజ్ లో  జరుగుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.

 

 సీఎం జగన్‌ పాలనపై చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.  కుప్పంలోనైనా, మంగళగిరిలోనైనా చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ని కూడా ఆయన చర్చలకు ఆహ్వానించారు. లోకేష్ కంటే ఆఫీస్‌ బాయ్‌లకే ఎక్కువ జ్ఞానం ఉంటే.. వారితోనైనా చర్చకు సిద్ధమని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ప్రకటించారు శ్రీకాంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: