దేశ వ్యాప్తంగా కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ఉన్నా సరే ఫలితం ఉండటం లేదు. ఇక కరోనా కేసుల్లో ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఏంటీ అంటే ప్రభుత్వ విభాగాలకు కరోనా సోకడం. అదే విధంగా పోలీసులకు సరిహద్దుల్లో ఉండే సైనికులకు కరోనా సోకడం. దీనిపై కేంద్రం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సైనికుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇక తాజాగా సైనికుడు ఒకరు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 5 న కరోనా పాజిటివ్ అని తేలిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ గత రాత్రి కన్నుమూశారు. ఆయన శ్రీనగర్ సిఆర్పిఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నారు.