తెలంగాణ సర్కార్ కు కృష్ణా బోర్డ్ భారీ షాక్ ఇచ్చింది. భక్త రామదాసు, దిండి, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు లేవని చెప్పింది. వారం రోజుల్లో ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొన్నిరోజుల క్రితం ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను చేపట్టవద్దని కృష్ణా బోర్డ్ ఆదేశించింది. 
 
తెలాంగాణలోని పలు ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లను సిద్ధం చేయాలని కృష్ణా బోర్డు సూచించింది. జగన్ సర్కార్ పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం జీవో ఇవ్వగా... ఈ జీవో వల్ల ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం మొదలైంది. ఈ ఫిర్యాదులపై సమావేశమైన కృష్ణా బోర్డు గతంలో మాదిరిగానే నీటి పంపకాలు జరగాలని తేల్చి చెప్పింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: