సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన స్వగ్రామమైన వంగరను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సందర్భంగా... చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా చర్చించారు.


పీవీ నరసింహారావు యావత్ తెలుగువారితో పాటు దేశం, ప్రపంచం గర్వించదగిన మహనీయుడని ఎమ్మెల్యే సతీశ్​ కొనియాడారు. పీవీ శత జయంతిని ఏడాది పొడుగునా అధికారికంగా దేశ విదేశాల్లో నిర్వహించాలని, అలాగే ఆయన స్వగ్రామం వంగరను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నిర్ణయించడం గొప్ప విషయమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: