భూముల క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంచే అవకాశాలను ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఎల్ఆర్ఎస్​ను సవాల్ చేస్తూ కప్పర హరిప్రసాద్ రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్​సేన్​రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.


ఎల్ఆర్ఎస్​పై దాఖలైన ఇతర వ్యాజ్యాలతో కలిపి విచారణ చేపడతామని.. దీనిపైనా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు ఉందని ఏజీని హైకోర్టు ఆరా తీసింది. ఈ నెలాఖరు వరకు ఉందని ఏజీ పేర్కొనగా.. దసరా సెలవులు ఉన్నందున అది తక్కువ సమయమని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: