ఉత్తర్​ప్రదేశ్​ ముజఫర్​నగర్ కతౌలీ తెహ్సిల్ జిల్లా ఫ్యామిలీ కోర్టు.. భర్తకు నెలవారీ భరణం ఇవ్వాల్సిందిగా ఓ ప్రభుత్వ ఉద్యోగినిని ఆదేశించింది. దాదాపు 9 సంవత్సరాల విచారణ తరువాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అయితే నెలకు 2వేలు భరణం చెల్లించాలని కోర్టు తీర్పు ఇవ్వడం గమనార్హం.కిషోరీలాల్​ సోహుంకర్, మున్నాదేవీలకు 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో దంపతులు 10ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. మున్నాదేవీ కాన్పూర్​లోని భారత ఆర్మీలో నాలుగో గ్రేడ్ ఉద్యోగినిగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. ఆమెకు నెలకు 12వేల పింఛను వస్తోంది.


కిషోరీలాల్ కతౌలీలో ఓ టీషాపు నడుపుతున్నాడు. అతని పేదరికం కారణంగా తన భార్యకు వచ్చే పింఛనులో కొంత ఇవ్వాలంటూ 9 ఏళ్ల క్రితం ముజఫర్​నగర్​లోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశాడు. ఈ క్రమంలో కోర్టు తీర్పును వెలువరించింది.కేసు ఇంకా పరిష్కారం కాలేదని కిషోరీలాల్​ అడ్వకేట్​ బలేష్​ కుమార్​ తయాల్ తెలిపారు. ఇద్దరు కలిసుండాలని కోర్టు గతంలో ఆదేశించింది. కానీ మున్నీదేవి దానికి అంగీకరించలేదన్నారు. దంపతులు ఇంకా విడాకులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: