దేశంలో క‌రోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అయితే  క‌రోనా యాక్టివ్‌ కేసుల్లో త‌గ్గుద‌ల క‌నిపిస్తున్న.. మ‌ర‌ణాలు సంఖ్య  మాత్రం దూసుకుపోతుంది.  దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,48,371 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.యాక్టివ్ కేసులు కూడా మ‌రో నాలుగు వేలు త‌గ్గ‌డంతో 3.71 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయాయి.  ఇక నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. గ‌త శుక్ర‌వారం అత్య‌ధికంగా 4185 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు దానికంటే 20 మంది అధికంగా మృతిచెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: