దేశంలో కరోనా మహమ్మరి తీవ్రంగా విజృంభిస్తుంది. రెండు రోజులు త‌గ్గిన కేసులు మ‌ళ్లీ పెరిగాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 3,62,720 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 4136 మంది మ‌ర‌ణించారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. అనేక వేల మంది వైద్యం అందక, సరైన సమయానికి ఆక్సిజన్ అందక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే WHO గ‌ణాంకాల ప్ర‌కారం ప్ర‌పంచవ్యాప్తంగా న‌మోద‌వుతున్న కొత్త కేసుల్లో భార‌త్‌లోనే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి భార‌త్‌లో న‌మోదైన కేసులు.. ప్ర‌పంచం మొత్తం కేసుల్లో 50 శాతానికి పైగా ఉన్నాయ‌ని పేర్కొన్న‌ది. దీంతో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌వించిన దేశాల్లో భార‌త్ అగ్ర‌భాగంలో నిలిచిందని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: