భార‌త క్రీడాదిగ్గ‌జం .. పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ (91) మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. కరోనా బారిన పడిన ఆయన కోలుకున్న తర్వాత వచ్చిన సమస్యలతో చండీగర్‌లోని పీజీఐఎంఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ‌గానే చ‌నిపోయారు. ఆయ‌న‌కు ఒక్క‌సారిగా జ్వ‌రం పెరిగి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో మృతి చెందారు. ఆయ‌న మృతిప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఎంతోమంది ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం తెలుపుతున్నారు.
ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు సైతం త‌న ట్విట్ట‌ర్‌లో మిల్కాసింగ్ మృతికి సంతాపం తెల‌ప‌డంతో పాటు ఆయ‌న గొప్ప‌త‌నం గురించి చెప్పారు. మిల్కాసింగ్ మృతితో తాను తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యాన‌ని.. ఆయ‌న మ‌ర‌ణం దేశానికి తీర‌ని న‌ష్టం అని.. ఆయ‌న అద్భుత‌మైన క్రీడా వార‌స‌త్వం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లువురు అథ్లెట్ల‌కు ఎప్పుడూ స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంద‌ని.. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. మ‌హేష్‌బాబు మిల్కాసింగ్ జీవితం గురించి ఇంత గొప్ప‌గా పెట్టిన పోస్టుకు త‌క్కువ టైంలోనే 15 వేల లైకులు, 3,800 రీ ట్వీట్స్ వ‌చ్చాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: