మొన్నీ మధ్య రెండు ముఠాలను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు మరో సారి నగరంలో వ్యభిచార దందా పడగ విప్పింది. ఇల్లను అద్దెకు తీసుకొని పద్దతిగా ఉంచుతూ ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారాన్ని చేయిస్తున్నారు. అందుకోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొని వస్తున్నారు.. పక్కా సమాచారం తో పోలీసులు దాడులు చెస్తున్నారు. తాజాగా వ్యభిచార గృహం పై ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు..
వివరాల్లొకి వెళితే.. ఏజీకాలనీ సమీపం లోని విజయ కల్యాణ్ అపార్ట్మెంట్స్ లోని ఓ ఫ్లాట్ లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్ నగర్ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రం నిర్వాహకుడు స్వామి తో పాటు అతనికి సహకరిస్తున్న వాసం శెట్టి దుర్గ , రాగుల మల్లేష్ ,లతో పాటు మరో యువతి, విటుడిగా వచ్చిన గోపాల్ అలియాస్ గోపీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపు లోకి తీసుకొని విచారణ జరుపుథున్నారు. వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు, నగదును స్వాదీనం చేసుకున్నారు.. ఈ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.