ఉయ్యాల జంపలా మూవీ హీరో రాజ్ తరుణ్. కేరీర్ మొదట్లో మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం చేతి నిండా సినిమాలు ఉన్నా కానీ ఒక్క హిట్ కూడా అందుకోలేకపోతున్నాడు.సినిమా చూపిస్తా మామ, కుమారి 21 ఎఫ్ లో నటించగా.. ఇవి మంచి విజయాన్ని అందిచాయి.ఇక ఆ తరువాత పలు సినిమాలలో నటించగా.. అంత సక్సెస్ అందలేవు. ఇక అప్పటి నుంచి సినీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజ్ ఎలాగైనా సక్సెస్ ని పొందాలనే పట్టుతో తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ 'పవర్ ప్లే' లో నటించగా ఈ సినిమా అంతా విజయాన్ని ఇవ్వలేదు.

ఇక లవ్ నేపథ్యంలో కాకుండా కొత్తరకం పాత్రలతో చేయాలనే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఎన్నో పరాజయాలు పొందిన రాజ్ తరుణ్ కు  చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా ‘స్టాండప్ రాహుల్’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు ‘కూర్చుంది చాలు’ అనేది ట్యాగ్ లైన్. బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది.ఆయన పాత సినిమాల కన్నా కొంచెం కొత్తగా కనిపిస్తున్న ఈ పోస్టర్ తో సినిమా మీద అంచనాలు పెంచింది. ’మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నందకుమార్ అబ్బీనేని – భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక డైరెక్టర్ శ్రీవాస్ గవిరెడ్డి తో రాజ్ తరుణ్  ఓ సినిమా ఇప్పటికే పూర్తిచేసాడని టాక్. అంతే కాకుండా మరో డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తుండగా అదికూడా అరవై శాతం పూర్తయిందని తెలిపాడు. ఇక వీటితో పాటు మరో కొత్త దర్శకుడితో దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా దాదాపు పూర్తి అయిందని తెలిపాడు. అంతేకాకుండా విజయ్ కుమార్ కొండా తో ఓ హ్యాట్రిక్ సినిమా చేయనున్నట్లు తెలిపాడు. ఇన్ని ఆఫర్ లతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్ ఇప్పుడైనా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: