శంకర్ డైరక్షన్ లో చరణ్ హీరోగా వస్తున్న మూవీ ప్రతి అప్డేట్ క్రేజీగా ఉంటుంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ఈమధ్యనే హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వానిని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ మూవీ షెడ్యూల్ కూడా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 8 నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న శంకర్, చరణ్ సినిమా 2022 జూలై వరకు పూర్తి చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణాలో ఈ మూవీకి సంబందించిన లొకేషన్స్ వేట మొదలు పెట్టారు డైరక్టర్ శంకర్.

మూవీ ఎక్కువ శాతం తెలుగు రెండు రాష్ట్రాల్లోనే షూట్ చేస్తారని తెలుస్తుంది. కొన్ని సీన్స్ కోసమే ఫారిన్ లొకేషన్స్ చూస్తున్నారట. ఈ మూవీ లో చరణ్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని టాక్. ఈ ఇయర్ సెప్టెంబర్ లో మొదలు పెట్టి 2022 జూలై కన్నా ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2022 దసరా రేసులో ఈ మూవీని దించాలని ప్లాన్ చేస్తున్నారట. స్టార్ మూవీస్ రిలీజ్ డేట్ క్లాషెస్ భారీగా ఉంటాయి.

అందుకే సినిమా ఓపెనింగ్ రోజే కొందరు స్టార్స్ తమ మూవీ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేస్తున్నారు. శంకర్, చరణ్ మూవీ కూడా సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యం 2022 దసరా రిలీజ్ అని ఎనౌన్స్ చేస్తారట. అయితే అనుకోవడం వరకు ఓకే కాని శంకర్ మూవీ అంటే భారీగా ఉంటుంది అనుకున్న విధంగా అనుకున్న టైం కు పూర్తి చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. అక్కడ ఉన్నది నిర్మాత దిల్ రాజు కాబట్టి కచ్చితంగా అనుకున్న విధంగానే షెడ్యూల్ జరిగేలా చూస్తారని చెప్పొచ్చు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న శంకర్, చరణ్ మూవీతో మళ్ళీ తిరిగి ఫాం లోకి రావాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు శంకర్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: