సినీ పరిశ్రమలోకి వచ్చిన కొంత సమయంలోనే మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో ఒక్కసారిగా రాణిస్తుంది. రకుల్ కె రీర్ పీక్ స్టేజ్ లో ఉండడంతో ఈ మధ్య ఈమె ధ్యాస పెళ్లి వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి తెలియజేస్తూ ఒక ఫోటోని అభిమానులతో పంచుకుంది. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ జాకి భగ్నానీ అనే ఒక వ్యక్తి తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్జాకీ ఎవరు అనే విషయాలపై ఎక్కువగా నెట్లో అయన గురించి వెతకడం మొదలు పెట్టారు. అయితే  జాకీ ఎవరు అనే విషయానికి వస్తే.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నటుడిగా నిర్మాతగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి.

జాకీ వ్యక్తిగత విషయలోకి వస్తే.. ఆయన కోల్ కత్తాలోని సింధీ ఫ్యామిలీలో జన్మించాడు. ఆయన తండ్రి పూజ ఎంటర్టైన్మెంట్స్ పేరుమీద ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక అదే తరుణంలో జాకీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే సినిమాలను నిర్మించాడు. అయితే  కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. రకుల్ ప్రీతిసింగ్ అక్షయ్ కుమార్ జంటగా నటించిన సినిమాకు నిర్మాతగా ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో పలువురు సినీ తారలు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు.. రకుల్ స్వతహాగా ఈ విషయాన్ని మీడియా ముందు చెబితే బాగుంటుందని కొంతమంది అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: