తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకు కొదవ లేదు. దాదాపు స్టార్ హీరోలే అరడజను పైగా మంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. ఇక యువహీరోలు ఎంతోమంది ఉన్నారు.. ఇక కొత్తగా చిత్ర పరిశ్రమలో హీరో గా ఎంట్రీ ఇస్తున్న వారు కూడా ఎక్కువే. అయితే ఎన్నో రోజుల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల కొరత ఉండేది. కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే స్టార్ హీరోయిన్ లుగా కొనసాగారు. ఇక ఏ సినిమాల్లో చూసిన వారే కనిపించే వారు. కానీ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా కొదవ లేకుండా పోయింది. ఎప్పుడూ కొత్త హీరోయిన్లు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదిస్తున్నారు.



 అయితే ఇటీవల కాలంలో హీరోయిన్లకూ టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందండోయ్. అందుకే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ల గురించి చెప్పుకోవాలంటే ముందుగా ముగ్గురు పేరు చెప్పుకోవాలి. వాళ్లే కృతి శెట్టి, కేతికశర్మ, ఫరియా అబ్దుల్లా. ఈ ముగ్గురు మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకర్షించి ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.


 ఉప్పెన అనే సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో జోడి కట్టి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ అమ్మడి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ కట్టిపడేసింది. ప్రస్తుతం శ్యామ్ సింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే ఈ అమ్మడికి తిరుగు ఉండదు అని చెప్పాలి. రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కవ్వించినా కేతికశర్మ ప్రస్తుతం లక్ష్య మూవీలో నటించి మెప్పించింది. ఇక జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించినా ఫరియా అబ్దుల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కీలక పాత్రల్లో నటించి అందరినీ అలరించింది.ఇక ఇప్పుడు డి అంటే డి అనే సినిమాలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: