అయితే ఇటీవల కాలంలో హీరోయిన్లకూ టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుందండోయ్. అందుకే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే కుర్రకారులో మంచి క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ల గురించి చెప్పుకోవాలంటే ముందుగా ముగ్గురు పేరు చెప్పుకోవాలి. వాళ్లే కృతి శెట్టి, కేతికశర్మ, ఫరియా అబ్దుల్లా. ఈ ముగ్గురు మొదటి సినిమాతోనే కుర్రకారును ఆకర్షించి ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.
ఉప్పెన అనే సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో జోడి కట్టి టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఈ అమ్మడి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ కట్టిపడేసింది. ప్రస్తుతం శ్యామ్ సింగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే ఈ అమ్మడికి తిరుగు ఉండదు అని చెప్పాలి. రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కవ్వించినా కేతికశర్మ ప్రస్తుతం లక్ష్య మూవీలో నటించి మెప్పించింది. ఇక జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులను నవ్వించినా ఫరియా అబ్దుల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కీలక పాత్రల్లో నటించి అందరినీ అలరించింది.ఇక ఇప్పుడు డి అంటే డి అనే సినిమాలో నటిస్తోంది.