బాహుబలి తో వరల్డ్ స్టార్ హీరో అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్.. ఆ సినిమా తర్వాత డార్లింగ్ ఎక్కువగా అలాంటి భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలి తర్వాత సాహో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమా అంతగా జనాల ను ఆకట్టుకోలేదు. తర్వాత ఇప్పుడు కొత్త కథల సినిమాలను చెస్తున్నారు. వరుస పాన్‌ ఇండియా సినిమాలు చేస్తూ హల్‌చల్ సృష్టిస్తున్నాడు. ప్రభాస్ క్రేజ్ను నిర్మాతలు సైతం క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే డార్లింగ్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.


ఇప్పుడు ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే, మరో సినిమాను ప్రభాస్ లైన్ లో పెట్టాడు.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా లో ప్రభాస్ రాముడి పాత్ర లో నటిస్తున్నాడు. దాదాపు చిత్ర షూటింగ్ ను చిత్ర యూనిట్ పూర్తీ చేసింది. ఇకపోతే అన్నీ కార్య క్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వీలైనంత త్వర లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.


ఈ మేరకు ఆదిపురుష్' సినిమా బడ్జెట్, రిలీజ్పై పలు ఆసక్తిర విశేషాలు సోషల్‌ మీడియా లో చక్కర్లు కోడుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటి వరకు అయిన ఖర్చు దాదాపు 400 కోట్లకు పైగా ఉందని సమాచారం. అంతేకాదు.. 15 భాషల్లో ప్రపంచవ్యాప్తం గా 20,000 థియేటర్ల లో ఒకేసారి ఆదిపురుష్ రిలీజ్ కానుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమా ను డార్లింగ్ ఫ్యాన్స్ పాన్ వరల్డ్ సినిమాగా పిలవడం గమనార్హం.. ఇకపోతే ఈ సినిమా తర్వాత డార్లింగ్ వరుస పాన్ ఇండియా సినిమాలలొ నటిస్తున్నారు.. అవి కూడా ఇదే ఏడాది లో విడుదలకు సిద్దం అవ్వనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: