అందాల ముద్దుగుమ్మ సమంత గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది.

ఇలా అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయిన సమంత ఇప్పటికి కూడా వరుస సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. సమంత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా అనేక సినిమాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సమంత హిందీలో ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అలాగే ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లలో నటిస్తోంది.  సమంత ప్రస్తుతం శాకుంతలం, యశోద వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో  లభించింది. ఈ సినిమాలు మరికొన్ని రోజుల్లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి . ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సమంత మాట్లాడుతూ... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం నాకు చాలా ఇష్టం అని, మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలను ఫోటో ద్వారా చెప్పడం సాధ్యం అవుతుంది అని సమంత చెప్పుకొచ్చింది.  కాకపోతే ట్రోల్స్,  నెగిటివ్ కామెంట్ ల వల్ల మొదట్లో చాలా బాధ పడే దానిని అని, ఆ బాధ వల్ల రాత్రి వేళల్లో నిద్ర కూడా లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి అని సమంత తెలియజేసింది. కాకపోతే ఇప్పుడు ఆటో ట్రోల్స్ ని,  నెగెటివ్ కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని సమంత తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: