బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ తాజాగా సామ్రాట్ పృథ్విరాజ్ అనే హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన మనుష  చిల్లర్ కథానాయికగా నటించగా, ఈ మూవీ కి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించాడు.

మూవీ లో సంజయ్ దత్,  సోనూసూద్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ జూన్ 3 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన సామ్రాట్ పృద్వి రాజ్ మూవీ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ను సంపాదించుకుంది. అలా నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు రోజు రోజుకు తగ్గుతూ వచ్చాయి. సినిమా విడుదలైన వారం రోజులకే ఈ మూవీ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా పడిపోయాయి. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు కేవలం యాభై కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ నష్టాలను తగ్గించుకోవడానికి చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ని ముందు అనుకున్న తేదీ కంటే ముందు గానే 'ఓ టి టి' లో చేయనున్నట్లుగా తెలుస్తోంది.  

సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ను ఈ సినిమా విడుదల అయిన మూడు నుండి నాలుగు వారాల తర్వాత 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ ప్రముఖ   ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ సినిమాను 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ చేసి కొంతమేర నష్టాలను తగ్గించుకోవాలని నిర్మాణ సంస్థ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: