టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ముకుంద మూవీ తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ క్లాస్ మూవీ లలో నటిస్తూనే మాస్ మూవీ లలో కూడా నటిస్తూ క్లాస్ మరియు మాస్ ప్రేక్షకులను సమానంగా అలరిస్తూ తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు .

ఇది ఇలా ఉంటే గద్దల కొండ గణేష్ మూవీ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా , తన మాస్ యాక్టింగ్ తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత గని , ఎఫ్ 3  మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఈ రెండు మూవీ లలో గని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోగా , ఎఫ్ 3 మూవీ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది . ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో వరుణ్ తేజ్ ,  ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు .

సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే వరుణ్ తేజ్ మరో క్రేజీ దర్శకుడితో మూవీ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సాహో మూవీ తో పాన్ ఇండియా మూవీ ని తెరకెక్కించిన సుజిత్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించబోతున్నాడు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ వార్త కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: