యాంకర్ అనసూయ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. బుల్లితెరపై ఆడియన్స్ కు ఆమె చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు రియాల్టీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రస్తుతం బుల్లితెరపై టాప్ పొజిషన్ లో దూసుకుపోతోంది. ఒకవైపు యాంకరింగ్, మరొకవైపు వెండితెర పై లు పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఉన్నది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ద్వారా నటిగా గుర్తింపు పొందింది అనసూయ. దీంతో ఇక అప్పటినుంచి ఈమె నటనకు మరింత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది ఇటీవల పాన్ ఇండియా చిత్రమైన పుష్ప లో కూడా దాక్షాయని పాత్రలో కనిపించింది.


ప్రస్తుతం ఈమె ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం దర్జా ఈ సినిమాలో  సునీల్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాకి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నది ఈ సినిమా చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ వేడుకలు నిన్నటి రోజున హైదరాబాదులో తాజ్ డెక్కన్ లో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ దర్జా సినిమా ప్రమోషన్ల భాగం కాలేకపోయినందుకు చిత్ర యూనిట్ తనను క్షమించాలని కోరుకుంది.


తన సినిమాకు ముందు నుంచి మంచి సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్యూ తెలియజేసింది అనసూయ మాట్లాడుతూ దర్జా ఫ్రీ రిలీజ్ వేడుకను విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ముందుగా ఈ సినిమా సపోర్ట్ చేసిన వారందరికీ థాంక్స్ చెప్పాలని తెలియజేసింది అలాగే వెంకటేష్ గారు, రాఘవేందర్ రావు గారు, అల్లు అరవింద్ గారు ,సురేష్ బాబు గారు  కు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పటివరకు జరిగిన ఈ ప్రమోషన్ ఈవెంట్ లో కూడా తన భాగం కాలేనందుకు చిత్రగుండం క్షమించమని అడుగుతోంది. కొన్ని కారణాల వల్ల తను ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనలేకపోయానని తెలిపింది. ఈ సినిమాల తను కనకం పాత్రలో నటించనాని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: