నిఖిల్ హీరోగా కలర్స్ స్వాతి హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ మూవీ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. అలా కార్తికేయ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో ఆ మూవీ కి సీక్వెల్ గా చందు మొండేటి తాజాగా కార్తికేయ 2 మూవీ ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. కార్తికేయ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. శ్రీనివాస్ రెడ్డి , వైవా హర్షమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్ట్ 13 వ తేదీన విడుదల అయ్యింది.

మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతోంది. ఇది ఇలా ఉంటే మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 12.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో విడుదలైన అతి తక్కువ రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకొని బాక్సా ఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటి వరకు 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 36.38 కోట్ల షేర్ , 68.00 కోట్ల గ్రౌండ్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో తొమ్మిది రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి  కార్తికేయ 2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా 23.08 కోట్ల లాభాలను అందుకొని ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: