యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో మరి కొద్ది రోజుల్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక మోషన్ పోస్టర్ ని కూడా మూవీ యూనిట్ విడుదల చేయగా ఆ మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కకబోతుంది.

అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనుండగా ,  రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కాబోతుంది అంటూ అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఇప్పటివ రకు కూడా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ...  కొరటాల శివ , జూనియర్ ఎన్టీఆర్ తో ముందుగా తెరకెక్కించాలి అనుకున్న కథను పక్కన పెట్టి , పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ కథను సిద్ధం చేస్తున్నాడు అని , అందువల్లనే ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కాస్త ఎక్కువ సమయం పడుతుంది అని , అలాగే నవంబర్ నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోయే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే గతంలో ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానితో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మాములు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: