బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ లలో బ్రహ్మాస్త్రం సినిమా ఒకటి. ఈ మూవీ లో బాలీవుడ్ యువ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా నటించిన , ఆలియా భట్మూవీ లో రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ,  అమితా బచ్చన్ , నాగార్జున , మౌని రాయి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెంచేశాయి.  ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని  సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల కాబోతుంది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ ఫ్రీ బుకింగ్ లను ఓపెన్ చేశారు. ఈ మూవీ ఫ్రీ బుకింగ్ ల లోనే అదిరిపోయే రికార్డ్ లను సృష్టిస్తుంది. ఈ మూవీ కేవలం పివిఆర్ మల్టీప్లెక్స్ లోనే ఫ్రీ బికింగ్ లలో భాగంగా  లక్ష టికెట్లు అమ్ముడు అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఇంత భారీ మొత్తంలో ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఫ్రీ బుకింగ్ లు జరగలేదు. దీనితో బ్రహ్మాస్త్రం మూవీ కి తొలి రోజే 30 నుండి 35 కోట్ల వరకు కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది అని కొంత మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: