సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప
సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆ
సినిమా నుంచి రాబోతున్న రెండవ భాగం పైనే ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఉంది. అతి తక్కువ రోజులలోనే 100 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించుకున్న ఈ సినిమాలను
బాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారనే చెప్పాలి. అంతటి స్థాయిలో
సక్సెస్ ను తెచ్చి పెట్టిన
బాలీవుడ్ ప్రేక్షకుల కోసం
సుకుమార్ ఈ
సినిమా యొక్క రెండవ భాగం యొక్క కథను పూర్తిగా
మార్చి అన్ని వర్గాల అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఇప్పుడు రూపొందించాడు .
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతుంది అనే వార్త పుష్ప
సినిమా అభిమానులలో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే ఈ
సినిమా కోసం
సుకుమార్ సరికొత్తగా ఆలోచనలు చేయబోతున్నాడు అని తెలుస్తుంది. ప్రమోషన్ విషయంలో కూడా
బాహుబలి 2 స్ట్రాటజీని ఉపయోగించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగంలో ఒక కరెక్ట్ పాయింట్ దగ్గర సినిమాను ఆపేసిన
సుకుమార్ ఇన్ని రోజులు ఆ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూసేలా హోల్డ్ చేయగలిగాడు.
ఆ విధంగా
బాహుబలి సినిమా స్ట్రాటజీ నీ పుష్ప సినిమాకు
సుకుమార్ అలాంటి స్ట్రాటజీని ఉపయోగించి సినిమాను ఇంత క్రేజీ తెచ్చేలా చేశాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో
అల్లు అర్జున్ సరసన
రష్మిక మందన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ద్వితీయార్థం మొత్తం
హీరో విలన్ ల మధ్య ఎంతో ఆసక్తికరమైన పోటీ ఉంటుందట. దీనికోసం ఒక
బాలీవుడ్ హీరోని కూడా విలన్ గా తీసుకోబోతున్నారని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇక ఈ సినిమాకు దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తూ ఉండగా రెండవ భాగానికి సంబంధించిన పాటలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే ఈ
సినిమా యొక్క షూటింగ్ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించబోతుంది.